Home Film News Prabhas Fans: సినిమా బాలేదు అన్నందుకు వ్య‌క్తిని చిత‌క‌బాదిన ప్ర‌భాస్ ఫ్యాన్స్
Film News

Prabhas Fans: సినిమా బాలేదు అన్నందుకు వ్య‌క్తిని చిత‌క‌బాదిన ప్ర‌భాస్ ఫ్యాన్స్

Prabhas Fans: ఇటీవ‌ల అభిమానుల ఆగ్ర‌హావేశాలని కంట్రోల్ చేయ‌డం ఎవరి వ‌ల‌న కావ‌డం లేదు. త‌మ హీరోల‌ని ఎవ‌రైన ఏమ‌న్నా అన్నా లేదంటే త‌మ హీరోల సినిమాలని బాలేదని చెప్పిన కూడా వారిపై దాడుల‌కి దిగుతున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా ఆదిపురుష్ సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వారిపై దాడుల‌కి దిగారు ప్ర‌భాస్ ఫ్యాన్స్ . వివ‌రాల‌లోకి వెళితే.. ఈ రోజు దేశ వ్యాప్తంగా భారీ అంచనాల‌తో విడుద‌లైంది ఆదిపురుష్ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా, ప్రపంచమంతటా కూడా జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి అని చెప్పాలి.. అయితే మూవీ దర్శకుడు ఓం రౌత్ చెప్పినట్టు.. సినిమా చూడడానికి సాక్షాత్తు ఆ హనుమంతుడే థియేటర్ కి వచ్చారా అన్న‌ట్టు అక్క‌డి వాతావ‌ర‌ణం ఉంది

థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప్ర‌భాస్ అభిమానుల సంద‌డి మాములుగా లేదు. థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌రిస్థి చూస్తుంటే హనుమంతుడే ఆ వానర రూపంలో వచ్చారా అన్న సందేహం కలుగుతుంది. అయితే ఆదిపురుష్ సినిమా ఆడుతున్న థియేటర్ లోకి అనుకోకుండా ఒక మారుతి వచ్చింది. అసలు అది ఎలా వచ్చిందో తెలియదు కానీ అందరితో కలిసి మారుతి తెగ సంద‌డి చేసింది. ఆ సమయంలో ప్రభాస్ రాముడి వేషంలో ఒక డైలాగ్ చెప్పుకొచ్చారు. శత్రువుని చంపితే శత్రుత్వం చావదు. క్షమించి చూద్దాం అని ప్ర‌భాస్‌ చెప్పే డైలాగ్ కి అయితే ప్రేక్షకులతొ పాటు ఫ్యాన్స్ కూడా జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దీంతో థియేట‌ర్ మొత్తం మారుమ్రోగింది.

అయితే ఆదిపురుష్ థియేట‌ర్ ద‌గ్గ‌ర సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆదిపురుష్ మూవీ బాగాలేదని మీడియాతో చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ మూవీ ఎలా ఉందని మీడియా వాళ్ళు అడగ్గా, నచ్చలేదు అని కామెంట్ చేయ‌డంతో.. అక్కడే ఉన్న అభిమానులు అత‌నిని చితకబాదారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ మూవీ ఆకట్టుకున్నప్పటికీ… విజువల్ ఎఫెక్ట్స్, రావణుడు గెటప్ నిరాశపరిచాయని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. గతంలో ప్రభాస్ పౌరాణిక చిత్రం చేసింది లేక‌పోవ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి… అయితే రాముడిగా ప్రభాస్ అద్భుతం చేశాడన్నమాట వినిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు మిన‌హా చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని చెప్పాలి. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ మూవీ నిర్మించ‌గా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకి పాత్ర పోషించింది. అజయ్-అతుల్ సంగీతం సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఈ చిత్రం నేడు వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...