Home Film News “ఆ కుక్కల్ని చూస్తే మన పరువు పోయినట్టే..” : రాజమౌళి
Film News

“ఆ కుక్కల్ని చూస్తే మన పరువు పోయినట్టే..” : రాజమౌళి

Rajamouli Delhi Airport Management

బాహుబలి ద్వారా తన ఖ్యాతిని విపరీతంగా పెంచుకున్న రాజమౌళి ఇప్పుడు RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే, ఏదో పనిమీద ఈ మధ్య ఒక విమానాశ్రయంలో దిగిన రాజమౌళి ట్విట్టర్ వేదికగా తన బాధని వ్యక్తం చేసారు. జక్కన్న ట్వీట్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. చాలా మంది అవునంటూ ఆయన్ని సమర్తిస్తున్నారు కూడా. ఇలా సమస్యలపై స్పందించడమే కావాల్సింది అనుకునేలా చేసిన ఆ సంఘటన ఏంటో చూద్దాం.

రాజమౌళి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడ వసతులు చూసి ఆయనకి మనస్తాపంగా అనిపించినట్లు ఉంది. ఎందుకంటే.. ఫామ్స్ ఫిల్ చేయాల్సిన చోట కనీసం టేబుల్స్ వసతి లేకపోవడం చాలా దారుణమనుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేసారు. విమానాశ్రయ యాజమాన్యం ఇలాంటి సమస్యలని చూసి వాటి పరిష్కారంగా టేబుల్స్ ని అరేంజ్ చేయడం చాలా చిన్న సర్వీస్ అని ఆయన గుర్తు చేసారు.

అలాగే.. ఇండియాకి వచ్చే విదేశీయుల దృష్టిలో ఇండియా గురించి తప్పుగా ఆలోచించేలా ఉన్న పరిస్థితులని గుర్తు చేస్తూ.. విమానాశ్రయంలో వీధి కుక్కలు తిరుగుతూ ఉండడాన్ని తప్పు బట్టారు. విదేశీయులు వాటిని చూస్తే పరిస్తితి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు? దయచేసి ఒకసారి ఈ సమస్యల వైపు చూడండి. ధన్యవాదాలు అని స్పందించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...