Home Film News Negative Tweets: ఆదిపురుష్‌పై నెగెటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే అంత డ‌బ్బు వ‌స్తుందా..!
Film News

Negative Tweets: ఆదిపురుష్‌పై నెగెటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే అంత డ‌బ్బు వ‌స్తుందా..!

Negative Tweets: భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క‌థ‌ని వ‌క్రీక‌రించి త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా సినిమా తీసాడ‌ని కొంద‌రు వాపోతున్నారు.ఇది క‌లియుగ రామాయ‌ణంలా ఉంద‌ని, చిత్రంలో రాముడి పాత్ర‌, సీత పాత్ర‌, రావ‌ణుడి పాత్ర ఏమంత బాగోలేవ‌ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే సినిమాపై ఒకవైపు నెగెటివ్ టాక్ వ‌స్తున్నా కూడా వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. కాక‌పోతే ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర బృందంపై సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది.  డైరెక్ట‌ర్  ఓం రౌత్ మన సంస్కృతిని పక్కన పెట్టి  హర్రర్ మూవీలా రామాయణాన్ని మార్చేసాడ‌ని మండిప‌డుతున్నారు.ఆ స్థానంలో హీరోగా ప్ర‌భాస్ లేక‌పోయి ఉంటే మూవీ భారీ ఫ్లాప్‌గా నిలిచేద‌ని చెబుతున్నారు.

అయితే  ఆదిపురుష్ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొంద‌గా, ఈ మూవీకి పెట్టిన పెట్టుబ‌డి వ‌స్తుందా అనేది ప్రశ్నార్ధకంగానే మారింది.. ఎక్క‌డ చూసిన కూడా మూవీపై నెగెటివ్ టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో 500 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్ట‌డం అసాధ్య‌మే అంటున్నారు ట్రేడ్ పండితులు. మ‌రోవైపు ఈ సినిమాని అనేక వివాదాలు చుట్టు ముడుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ మేక‌ర్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి రాంగ్ వేని ఎంచుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. డాక్టర్ నిమో యాదవ్ అనే వ్యక్తికి ట్విట్టర్ లో 50 వేల‌కి పైగా ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, ఆయ‌న  చేసిన ఆరోపణలు ఇప్పుడు  సంచలనం రేపుతున్నాయి.

ఓ అజ్ఞాత వ్య‌క్తి.. నిమోకి మెసేజ్ ఇలా పెట్టాడు. ‘హలో డాక్టర్ నిమో యాదవ్, మీకు అర్జెంటు రిక్వెస్ట్.. ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ పోస్ట్ లు పెడితే..ఒక్కో పోస్ట్ కి రూ 9500 ఇస్తాం. వెంటనే అలా చేసి ఆ విష‌యాన్ని మాకు తెలియజేయండి మీకు డబ్బు వస్తుంది’ అనే మెసేజ్ రాగా, దానిని అతడు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  మరో ట్విట్టర్ యూజర్ కి కూడా ఇలాంటి డీల్ కుదిరింది. రోషన్ రాయి అనే యూజర్ కి ట్విట్టర్ లో 11 వేలమంది ఫాలోవర్స్ ఉండ‌గా, అత‌ను త‌న సోష‌ల్ మీడియాలో  టి సిరీస్ సంస్థకి చెందిన కొందరు ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ ట్వీట్స్ పెట్టమని డీల్ ఇస్తున్నారు.  రూ.5500 ఆఫర్ చేస్తున్నారు. అయితే నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు రాంగ్ పర్సన్ ని ఎంచుకున్నారు అంటూ పోస్ట్ పెట్టాడు. మ‌రి ఇలా డబ్బు ఆఫర్ చేసింది మేకర్సేనా లేక వేరే ఎవ‌రైననా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...