Home Film News ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?
Film News

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌ ఉంది. పరుచూరి సోదరులు రాసిన ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. ఆ సినిమా వచ్చి 21 ఏళ్లు అయినా ఆ డైలాగ్‌ ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంది. అయితే ఒరిజనల్‌గా ఈ డైలాగ్‌ పరుచూరి సోదరులది కాదు.. మహానటుడు ఎన్టీఆర్‌ది.

Nandamuri Balakrishna says 'Babbai loved me more than his own kids' after  controversy over ANR comment - India Today

అదేలాగంటే..
రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఎన్టీఆర్‌ నటించిన చివరి చిత్రం ‘నాదేశం’. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె. దేవీవరప్రసాద్‌ , ఎస్‌.వెంకటరత్నం నిర్మాతలు. హిందీలో అమితాబ్‌ నటించిన ‘లావరిస్‌’ సినిమాకు ఇది రీమేక్‌. అసలు విషయానికి వస్తే.. ‘నాదేశం’లో ముగింపు సన్నివేశంలో మాత్రమే ఒకే ఒక ఫైట్‌ ఉంది. మాస్‌ ఇమేజ్‌ కలిగిన ఎన్టీఆర్‌కు కేవలం ఒకే ఒక ఫైట్‌ కాకుండా మరో ఫైట్‌ ఉంటే బాగుంటుందని నిర్మాతల అభిప్రాయం.

అయితే ఆ విషయం డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌కు చెప్పే ధైర్యం లేక ఆ బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణ కు అప్పగించారు. ఒక రోజు ఎన్టీఆర్‌ను ఇంటి దగ్గర పికప్‌ చేసుకొని కారులో షూటింగ్‌కు బయలుదేరారు. ముందు సీటులో దేవీవరప్రసాద్‌, ఎన్టీఆర్‌ మేకప్‌మాన్, వెనుక సీటులో ఎన్టీఆర్‌, పరుచూరి గోపాలకృష్ణ కూర్చున్నారు. మాటల మధ్యలో సినిమాలో మరో ఫైట్‌ ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావించారు గోపాలకృష్ణ. ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగుండటంతో ‘ఏ సీనులో ఆ ఫైట్‌ పెడతారు?’ అని ప్రసన్నంగా అడిగారు.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

పరుచూరి గోపాలకృష్ణ ఒక ఆర్టిస్ట్‌ పేరు చెప్పి.. ‘ఈ సందర్భంలో వారితో మీకు ఫైట్‌ పెడితే బాగుంటుందండి’ అని చెప్పారు. ‘అసలు బాగుండదు’ అని చెప్పి ఆ విషయం అంతటితో ముగించారు ఎన్టీఆర్‌. అది గ్రహించి టాపిక్‌ మళ్లించారు గోపాలకృష్ణ. అయితే ముందు సీటులో ఉన్న దేవీవరప్రసాద్‌ మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు.

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’... ఆ డైలాగ్‌ NTRదే!

‘మళ్లీ అడుగు’ అన్నట్లు గోపాలకృష్ణకు సైగ చేశారు. దాంతో ధైర్యం చేసి ‘అది కాదు అన్నగారూ.. మీరు నాలుగు దెబ్బలేసినా మాలాంటి అభిమానులకు ఆనందంగా ఉంటుంది కదా’ అన్నారు. దేవీవరప్రసాద్‌ ఈ విషయం అడిగిస్తున్నారన్న విషయం ఎన్టీఆర్‌కు అర్థమైంది. అందుకే వివరణ ఇస్తూ ‘దేనికైనా ఓ స్థాయి ఉంటుంది. సత్యనారాయణతో ఫైట్‌ ఉంటే చెప్పండి.. చేస్తాం. అంతేకానీ మీరు చెప్పిన వారితో ఫైట్‌ చెయ్యమంటారా.. ‘మేం గట్టిగా కన్నెర్ర చేస్తే గుండాగి చస్తారు వారు’ అన్నారు. ఈ సంఘటన 1982లో జరిగింది. ఇరవై ఏళ్ల అనంతరం వచ్చిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో యధాలాపంగా ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌ రాశారు గోపాలకృష్ణ. రాసిన తర్వాత కానీ అది ఎన్టీఆర్‌ ఆ నాడు తనతో అన్న డైలాగ్‌ అని ఆయనకు గుర్తు రాలేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...